రాయచోటి బస్ స్టాండ్ విస్తరణ అభివృద్ధి పనులను త్వరితగతిన ప్రారంభించాలి…
రాయచోటి ఆర్ టి సి బస్ స్టాండ్ విస్తరణ అభివృద్ధి పనులను త్వరితగతిన ప్రారంభించాలని ఆర్ టి సి అధికారులుకు ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి సూచించారు.శుక్రవారం రాయచోటిలోని తన కార్యాలయంలో ఆర్ టి సి డిఈ పోతురాజు,డిఎం శ్రీనివాస రావులతో బస్ స్టాండ్ విస్తరణ పనులపై చర్చించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఆర్ టి సి బస్ స్టాండ్ విస్తరణ అభివృద్ధి పనులుకు రూ 2.50 కోట్ల నిధులు మంజూరు అయిన నేపథ్యంలో త్వరగా టెండర్ పక్రియను ప్రారంభించాలని సూచించారు.చిన్నమండెం, గాలివీడు బస్ స్టాండ్ లలో సిసి రోడ్ల నిర్మాణాలను చేపట్టాలని ఆదేశించారు.నియోజకవర్గ పరిధిలోని గ్రామాలలో బస్ సర్వీసులుపై శ్రీకాంత్ రెడ్డి ఆరా తీశారు.