మత సామరస్యానికి ప్రతీకగా రాయచోటి నిలవాలి
ఆర్.బి.ఎం: శుభాల వసంతం రంజాన్ అని ఎంఎల్ ఏ శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. రంజాన్ పర్వదినం సందర్భంగా రాయచోటి పట్టణంలోని ఈద్గాలో జరిగిన నమాజ్ ప్రార్థనలలో ముస్లిం సోదరులుతో కలసి శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూనెల రోజుల పాటు భక్తి శ్రద్దలతో కఠోర ఉపవాస దీక్షలు ఉండి నేడు భక్తి శ్రద్ధలతో , సంతోషాలుతో పండుగ జరుపుకుంటున్నారన్నారు.నమాజ్ ప్రార్థనలలో వేలాది మంది పాల్గొనడం హర్షనీయమన్నారు.ఈద్గాలో ప్రార్థనల సౌకర్యార్థం ఏర్పాట్లు చేసిన ఈద్గా కమిటీ, మున్సిపల్, ఇతర శాఖల అధికారులు, సిబ్బందికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ముస్లిం మైనారిటీల సంక్షేమానికి జగన్ ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు.అల్లా దయతో ప్రజలందరూ సుభిక్షంగా,సుఖ సంతోషాలతో జీవించాలని, నూతన రాయచోటి అన్నమయ్య జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని,మత సామరస్యానికి ప్రతీకగా రాయచోటి నిలవాలని ఆయన ఆకాంక్షించారు.