ప్రజలందరిలో భక్తి భావంపెంపొందాలి…
ఆర్.బి.ఎం: ప్రజలందరిలో భక్తి భావంపెంపొందాలని ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి ఆకాంక్షించారు. రాయచోటి రూరల్ మండలం శిబ్యాల దొండ కొండమ్మ ఆలయంనందు సోమవారం జరిగిన విగ్రహ ప్రతిష్ఠలో ముఖ్య అతిధిగా శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ దొండ కొండమ్మ ఆశీస్సులుతో వర్షాలు సంవృద్దిగా కురిసి,ప్రజలందరూ సుభిక్షంగా,సుఖ సంతోషాలుతో విరజిల్లాలని ఆయన ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో జెడ్ పి టి సి వెంకటేశ్వర రెడ్డి, వైఎస్ఆర్ సిపి నాయకులు డా సత్యనారాయణ రెడ్డి,ఏ పి ఎం డి సి డైరెక్టర్ శ్రీనివాసులు రెడ్డి,రఘురామిరెడ్డి,సాయిరాం రెడ్డి, నాగరాజు,సిఎల్ నరసింహులు, నాగేశ్వర, హరినాథరెడ్డి,జనార్దన, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.