జమ్ము కశ్మీర్‎లో వరుస పేలుళ్లు..

జమ్ము కశ్మీర్‌: ఉదంపుర్‌లో వరుస పేలుళ్లు సంభవించాయి. ఉదయం 8 గంటల వ్యవధిలో ఒకేచోట రెండు పేలుళ్లు సంభవించాయి. బస్సుల్లో బాంబులు పేలడం చర్చనీయాంశమైంది. సాధారణంగా కశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడులు, ఎన్‌కౌంటర్‌ల ఘటనలు తరచూ వార్తల్లో చూస్తుంటాం. కానీ బస్సులో పేలడంపై చర్చమొదలైంది. ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. వీరిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన జరిగిన కొద్ది గంటలకే ఉదంపుర్​లోని మరో బస్సులో పేలుడు సంభవించింది. అయితే, బస్సులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది. ఇవి రెండు ప్రమాదాలు కావని, పేలుళ్లే అని పోలీసులు నిర్ధరించారు. పోలీసులతో పాటు ప్రభుత్వ ఏజెన్సీలు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు మొదలుపెట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *