నాగార్జున నటించిన ‘ది ఘోస్ట్’ట్రైలర్ ను శుక్రవారం విడుదల చేశారు. ఈ సినమాలో నాగార్జున ప్రధాన పాత్రలో నటించారు. ప్రవీణ్ సత్తారు ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. “ఇంతకీ ఎవడు వాడు?”… అనే డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. నాగ్ ను ‘ది ఘోస్ట్’ గా ఇంట్రడ్యూస్ చేసే సీన్ ఈ ట్రైలర్ లో పొందుపరిచారు. ఫారెన్ లొకేషన్లలో చిత్రీకరించిన ఫైట్ సీక్వెన్స్ లను తాజా ట్రైలర్ లో చూడొచ్చు. కాగా, ‘ది ఘోస్ట్’ చిత్రం అక్టోబరు 5న వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతోంది. ఇందులో నాగ్ సరసన సోనాల్ చౌహాన్ కథనాయిక కాగా, గుల్ పనాగ్, అనికా సురేంద్రన్, మనీష్ చౌదరి, రవి వర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, బిలాల్ హుస్సేన్ ఇతర పాత్రలు పోషించారు.