ఆ దేవాలయంలో ప్రసాదంగా చికెన్,మటన్… ఎక్కడో తెలుసా?
ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఆచారసాంప్రదాయాలు మన భారత దేశంలోనే ఉన్నాయి. ప్రతి దేవాలయంలో ప్రసాదంగా భక్తులకు పులియోర,దద్దోజనం స్వీట్లు ఇస్తుంటారు ఇది సహజం అందరికి తెలిసిందే కానీ ఇవి కాకుండా మన భారత దేశంలోని పలుప్రాంతాల్లో వీటికి బదులుగా మాంసాన్ని ప్రసాదంగా భక్తులకు అందజేస్తున్నారు. ఆ వింత ఆచారం తమిళనాడులోని వడక్కంపట్టి గ్రామంలో మునియడి ఆలయం, ఒడిశాలోని పూరి జగన్నాథ సముదాయంలోని విమల ఆలయం, యూపీలోని గోరఖ్పూర్లో తార్కుల్హా దేవి ఆలయం,కేరళలోని పరస్సానిక్ కొడవు ఆలయం, పశ్చిమ బెంగాల్లోని కైల్ఘాట్ కాళీ ఆలయం, దక్షిణేశ్వర్ కాళీ ఆలయం, బీర్భూమ్లోని తారాపీత్ ఆలయం, అసోంలోని నీలాచల్ కొండలలోని కామాఖ్య దేవాలయాల్లో కొనసాగిస్తున్నారు.