TS NEWS: పేదల పక్షపాతి కెసిఆర్: పద్మారావు గౌడ్,ఉప సభాపతి

పేదల పక్షపాతి కెసిఆర్: పద్మారావు గౌడ్,ఉప సభాపతి

ఆర్.బి.ఎం సికింద్రాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ పేదల పక్షపాతి అని ఉప సభాపతి పద్మారావు గౌడ్ అన్నారు. దళిత బంధు పధకంలో భాగంగా బౌధనగర్ డివిజన్ కు చెందిన,వేణుకు సెంట్రింగ్ సామాగ్రిని అయన అందచేశారు. ఈ సందర్బంగా ఉప సభాపతి పద్మారావు గౌడ్ మీడియాతో మాట్లాడుతూ దళిత బంధు పథకం పేదల పాలిట వరంలాంటిది అని అన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడు ధనికులు కావాలనే ఆలోచనతోనే దళిత బంధు పథకాన్ని కెసిఆర్ ప్రవేశ పెట్టారని అయన అన్నారు. ఈ దళిత బంధు పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని పద్మారావు గౌడ్ సూచించారు.

Leave a Reply

Your email address will not be published.