దెబ్బతిన్న రహదారులకు త్వరితగతిన మరమ్మత్తులు చేపట్టాలి…
- పంచాయతీ రాజ్ ఈ ఈ కి సూచించిన చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి.
ఆర్.బి.ఎం రాయచోటి: వర్షాలతో దెబ్బతిన్న రహదారులకు త్వరితగతిన మరమ్మత్తులు చేపట్టాలని పంచాయతీ రాజ్ ఈఈ రామచంద్రారెడ్డికి చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి సూచించారు. సోమవారం శ్రీకాంత్ రెడ్డి తన కార్యాలయంలో జెడ్ పి మాజీ వైస్ చైర్మన్ దేవనాధ రెడ్డి,మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాష, డి సి ఎం ఎస్ మాజీ చైర్మన్ ఆవుల విష్ణువర్ధన్ రెడ్డి, సర్పంచ్ ల సంఘ అధ్యక్షుడు చిదంబర్ రెడ్డి, మాజీ ఎం పి పి జనార్దన్ రెడ్డి లతో కలసి పంచాయతీ రాజ్ ఈఈ తో అధిక వర్షాలుతో దెబ్బతిన్న రహదారులుపై ఆయన మండలాల వారీగా సమీక్షించారు. పంచాయతీ రాజ్ అభివృద్ది పనులపై ఆరా తీశారు.ఎం పి ల్యాడ్స్ పనులపై చర్చించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎం పి పి పొత్తూరి రవీంద్ర నాయుడు, సర్పంచ్ పాల వెంకట రమణ నాయుడు, ఎం పి టి సి రవిశంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.