హైదరాబాద్: బేగంపేటలో ఎంఎంటీఎస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. పెద్ద పెద్ద శబ్ధాలు చేస్తూ ట్రైన్ ఆగిపోవడంతో ప్రయాణికులు భయబ్రాంతులకు గురైయ్యారు. దీంతో ట్రైన్ లో ఉన్న ప్రయాణికులు ఏమీ చేయాలో తోచక చాలామంది ప్రయాణికులు కంగారుపడి ట్రైన్ దిగి పరుగులుపెట్టారు. సకాలంలో లోకో పైలెట్ స్పందించి సమస్యను గుర్తించడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు చెప్పుకొచ్చారు. అధికారులు ఇంజిన్కు మరమ్మతులు పూర్తిచేయడంతో రైలు మళ్లీ కాసేపు తర్వాత బయల్దేరింది. దీంతో ప్రయాణికులు సాఫీగా వారీ వారీ ఆఫీసులకు వెళ్లారు.