హైదరాబాద్: ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్రకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సిద్దమవుతున్నారు. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే బండి సంజయ్ లక్ష్యంగా పెట్టుకుని సంగ్రామ యాత్ర విడతల వారీగా పాదయాత్ర చేస్తున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. ఇప్పటికే బండి నాలుగు విడతలుగా పాదయాత్ర చేశారు. ఇప్పుడు ఐదో విడతకు రెడీ అయ్యారు. ఈ సంగ్రామ యాత్రను అక్టోబర్ 15 నుండి బైంసా నుంచి కరీంనగర్ వరకు పాదయాత్ర సాగుతుందని బీజేపీ శ్రేణులు తెలిపారు.