హైదరాబాద్: మునుగోడు బై ఎలక్షన్ నవంబర్ 2వ వారంలో మునుగోడు ఉపఎన్నిక జరగనున్నట్లు సమాచారం. మునుగోడు ఉపఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. దసరా తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పోలింగ్కు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారులకు ఈసీఐ ఆదేశించింది. దీంతో నల్గొండ జిల్లా కలెక్టర్, అధికారులు ఏర్పాట్ల పనులను పర్యవేక్షిస్తున్నారు.