సిరాజ్ ఇన్..బుమ్రా ఔట్

బీసీసీఐ నుంచి హైదరాబాదీ పేసర్ మహమ్మమద్ సిరాజ్ కు పిలుపునిచ్చారు. పేసర్ బుమ్రా వెన్ను గాయం కావడంతో ప్రస్తుతం జరుగుతున్న టీ20 సిరీస్ కు దూరం అయ్యారు. ఇప్పుడు బుమ్రా ప్లేసులో సిరాజ్ ని తీసుకున్నట్లు సెలక్టర్లు ట్వీట్టర్ ద్వారా వెల్లడించారు. దక్షిణాఫ్రికాతో మిగిలిన రెండు టీ20లకు సిరాజ్ ను ఎంపిక చేసినట్టు ఒక ప్రకటనలో బీసీసీఐ తెలిపింది. బుమ్రా ప్రస్తుతం బీసీసీఐ మెడికల్ టీమ్ పర్యవేక్షణలో ఉన్నాడని పేర్కొంది. మరోవైపు 3 టీ20ల సిరీస్ లో టీమిండియా 1-0తో లీడ్ లో ఉంది. తిరువనంతపురంలో జరిగిన తొలి మ్యాచ్ లో భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొందింది. రెండో మ్యాచ్ ఆదివారం నాడు గువాహటిలో జరుగుతుంది.

Leave a Reply

Your email address will not be published.