టీమిండియా మాజీ సెలక్టర్ సబా కరీం మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. మరి కొద్దీ రోజుల్లో టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. టీమిండియా జట్టులో దినేశ్ కార్తీక్, రిషభ్ పంత్ మధ్య పోటీ తీవ్రంగా ఉంది. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో టీమిండియా టీ20 సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్ కు బీసీసీఐ ఇద్దరికీ అవకాశం కల్పించింది. అయితే ఆడే అవకాశాన్ని మాత్రం దినేశ్ కార్తీక్ కే ఇస్తోంది. ఈ నేపథ్యంలో దినేశ్ కార్తీక్ వైపే టీమ్ మేనేజ్ మెంట్ మొగ్గు చూపడం మంచి నిర్ణయంగా భావిస్తున్నానని సబా కరీం చెప్పారు. రిషభ్ పంత్ ను ఆ స్థానంలో ఎప్పుడూ ప్రయత్నించలేదని చెప్పారు.