టాలీవుడ్ అగ్రహీరో తన ఫ్యామిలీతో బిజీ బిజీగా ఉన్నట్లు సమాచారం. పుష్ప మూవీ భారీ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఆ హిట్ ను అల్లు చాలా ఎంజాయ్ చేశారు కూడా. ఇప్పుడు పుష్ప-2 షూటింగ్ మొదలైంది. అయితే..షూటింగ్ లో బిజీగా ఉన్న అల్లు అర్జున్ కాస్తంత రిలాక్స్ అయినట్లు తెలుస్తోంది. భార్యా పిల్లలతో కలిసి అల్లు అర్జున్ స్వర్ణ దేవాలయాన్ని దర్శించున్నారు. ప్రత్యేక ప్రార్థనల్లో పాలుపంచుకున్నారు. ఇప్పుడు హీరో అల్లు ఫ్యామిలీ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.