కాంగ్రెస్ పార్టీ ఒక సచ్చిపోయిన పార్టీ: వైఎస్ షర్మిల

కాంగ్రెస్ పార్టీ ఒక సచ్చిపోయిన పార్టీ: వైఎస్ షర్మిల

ఆర్ బి ఎం డెస్క్ హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఒక సచ్చిపోయిన పార్టీ అని ఈ రోజు వైఎస్ షర్మిల మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పేరు పై గెలవలేదని షర్మిల అన్నారు. ఆనాడు తన తండ్రి రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేయడానికి నడుం బిగిస్తే అప్పటి కాంగ్రెస్ పార్టీ కనీసం పాదయాత్రకు అనుమతులు కూడా ఇవ్వలేదని ఆమె మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర కు అనుమతి ఇవ్వకపోయినా ప్రజలపై భరోసాతో రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర మొదలుపెట్టారని ఆమె అన్నారు. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని కాకుండా ప్రజలను నమ్మి ముందుకు కదిలారని షర్మిల అన్నారు.ప్రజలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి నమ్మి విశ్వసించి ఆయన్ను రెండుసార్లు అధికారంలోకి తీసుకొచ్చారు అని షర్మిల వ్యాఖ్యానించారు. రాజశేఖర్ రెడ్డి గారి విజయంలో కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం సంబంధం లేదని షర్మిల తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తన తండ్రికి వెన్నుపోటు పొడిచిందని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు.తన తండ్రి చనిపోయిన తర్వాత ఆయనపై ఎఫ్ఐఆర్ బుక్ చేయడం అమానుషమని షర్మిల అన్నారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఎంతో మందికి రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అని షర్మిల వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published.