దేశంలోనే చరిత్ర లిఖించిన రైతుబంధు: డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ ఎమ్మెల్యే

దేశంలోనే చరిత్ర లిఖించిన రైతుబంధు: డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ ఎమ్మెల్యే

ఆర్.బి.ఎం,వికారాబాద్: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ పట్టణంలో ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ముందుచూపుతో సాగునీటి వసతి కల్పన, వ్యవసాయ అనుకూల పథకాలు, విధానాలతో వ్యవసాయ రంగ స్వరూపం మారిందని ఎమ్మెల్యే అన్నారు.

రైతుభీమా, ఉచితకరెంటు, సాగునీరు, రైతుబంధు వంటి పథకాల అమలు కోసం ఏటా 60 వేల కోట్లు ఈ రంగానికి ఖర్చుచేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ మాత్రమేనని ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. వ్యవసాయానికి చేయూతనిచ్చి రైతును నిలబెట్టిన ఘనత కూడా టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని ఈ సందర్భంగా వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్  అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Dr.naresh goud

Leave a Reply

Your email address will not be published.