కుల్కచర్ల పోలీస్ స్టేషన్లో ఎంపీ అరవింద్ పై ఫిర్యాదు.

rbm

కుల్కచర్ల పోలీస్ స్టేషన్లో ఎంపీ అరవింద్ పై పిర్యాదు..

ఆర్.బి.ఎం వికారాబాద్,కుల్కచర్ల: వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలోని అంబెడ్కర్ ప్రధాన చౌరస్తాలో బీజేపీ ఎంపీ అరవింద్ దిష్టిబొమ్మను ప్రజా సంఘాల ఆధ్వర్యంలో దహనం చేశారు. ఎస్సి,ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని బీజేపీ ఎంపీ అరవింద్ హేళన చేసి మాట్లాడం పట్ల అయన దిష్టి బొమ్మ దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతు ఎంపీ అరవింద్ ఎస్సి ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని హేళన చేస్తూ మాట్లాడం బాధ కల్గించిందని ప్రజా సంఘాల నాయకులు అన్నారు. అధికార అహంకారంతో ఎంపీ అరవింద్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు తక్షణమే భహిరంగ క్షమాపణ చెప్పాలని ప్రజా సంఘాల నాయకులు డీమాండ్ చేశారు. కాగా కుల్కచర్ల పోలీస్ స్టేషన్లో ఎంపీ అరవింద్ పై ఎస్సి ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలనీ ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో రాథోడ్ శ్రీనివాస్ నాయక్ భరత్ కుమార్ తదితర నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.