TS NEWS: రోడ్డుపై బైటాయించిన నర్సయ్యగూడ గ్రామస్తులు..

రోడ్డుపై బైటాయించిన నర్సయ్యగూడ గ్రామస్తులు..

ఆర్.బి.ఎం వికారాబాద్: వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని నరసయ్యగూడ గ్రామానికి బీటీ రోడ్డు వేయాలని డిమాండ్ చేస్తూ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు నాగవర్ధన్ ఆధ్వర్యంలో పరిగి నుండి షాద్నగర్ వెళ్లే ప్రధాన రహదారిపై నరసయ్యగూడ గ్రామస్తులు బైటాయించి నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ నాయకుడు నాగవర్ధన్ మాట్లాడుతూ వర్షాకాలం వచ్చిందంటే నర్సయ్యగూడ గ్రామానికి వెళ్లాలంటే రోడ్డు చిత్తడిగా మారి గ్రామస్థులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అయన అన్నారు. వెంటనే నర్సయ్యగూడ గ్రామానికి బీటీ రోడ్డు మంజూరు వేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, యువత పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.