నవాబుపేట్ మండల్ కేశవపల్లిలో అంబేద్కర్‌ కు అవమానం..

నవాబుపేట్ మండల్ కేశవపల్లిలో అంబేద్కర్‌ కు అవమానం..

ఆర్.బి.ఎం నవాబుపేట్: రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ను కించపరిచిన భాస్కర్‌రెడ్డి అనే యువకుడిపై చర్యలు తీసుకోవాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. మండలంలోని కేశవపల్లిలో గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. అయితే ఈ వేడుల్లో అంబేద్కర్ ఫొటోను మహాత్మాగాంధీ ఫోటో పక్కన పెట్టినందుకు భాస్కర్‌రెడ్డి కించపరిచేలా మాట్లాడారని స్థానిక దళిత యువకులు తెలిపారు. అంబేద్కర్‌ను కించపరిచేలా మాట్లాడిని భాస్కర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని జిల్లా అంబేద్కర్ దళిత సంఘం నాయకులు, బీఎస్సీ నేతలు నవాబుపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. భాస్కర్‌రెడ్డి ఎస్సీఎస్టీ అట్రాసిటి కింద కేసు నమోదు చేయాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published.