దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొన్న వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొన్న వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

ఆర్.బి.ఎం వికారాబాద్: వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 19వ వార్డు (రామయ్యగూడ) కౌన్సిలర్ ఆర్. నర్సింలు ఇటీవల మరణించడం జరిగింది. ఈరోజు వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ , మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ మరియు బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ గారితో కలిసి రామయ్యగూడలో జరిగిన దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొని, నర్సింలు గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.