గురుమూర్తి కుటుంబ సభ్యులను పరామర్శించిన వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
ఆర్.బి.ఎం వికారాబాద్: వికారాబాద్ నియోజవర్గం, ధారూర్ మండలం నాగసముందర్ ఎంపీటీసీ మండల ఉపాధ్యక్షులు అనంతయ్య కుమారుడు గురుమూర్తి ఇటీవల మరణించడంతో వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శంచి, వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఎమ్మెల్యే తో పాటు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.