వ్యవసాయ మార్కెట్లల గల పెండిగ్ పనులను పూర్తిచేయాలి : వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్..
ఆర్.బి.ఎం: ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి వర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని హైదరాబాదులోని మినిస్టర్స్ క్వార్టర్స్ లోని ఆయన నివాసంలో వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
అనంతరం వ్యవసాయ రంగం గురించి మరియు వికారాబాద్ నియోజకవర్గానికి సంబందించిన వివిధ అంశాల పై చర్చించడం జరిగింది. వికారాబాద్ నియోజక వర్గంలోని వివిధ వ్యవసాయ మార్కెట్లలో పెండింగ్ లో ఉన్న పనులను త్వరగా పూర్తిచేయాలని మంత్రి ని కోరడం జరిగింది. అందుకు గాను మంత్రి సానుకూలంగా స్పందించారు.