హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

  1. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

ఆర్.బి.ఎం హైదరాబాద్: ప్రముఖుల పర్యటనల నేపథ్యంలో నగరంలో పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. హెచ్‌ఐసీసీ మాదాపూర్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, రాజ్ భవన్, పంజాగుట్ట బేగంపేట్ ఎయిర్‌పోర్టు–పరేడ్ గ్రౌండ్ ప్రధాన రహదారుల్లో ఆంక్షలు విధించారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ పూర్తి స్థాయిలో ఆంక్షలు ఉంటాయని పోలీసులు ప్రకటించారు. అలాగే టివోలి ఎక్స్ రోడ్ నుంచి ప్లాజా ఎక్స్ రోడ్ మధ్య రహదారిని పూర్తిగా మూసివేస్తారు. సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్ నుంచి 3 కిలోమీటర్ల పరిధిలోని అన్ని జంక్షన్లు, రోడ్లలో ప్రయాణాలపై ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. అంతేకాకుండా పంజాగుట్ట వైపు నుంచి ఖైరతాబాద్, ఆర్‌టీసీ ఎక్స్ రోడ్, మీదుగా చిలకలగూడ నుంచి ఫ్లాట్ ఫారం నంబర్ 10 ద్వారా దారిని మల్లించనున్నారు. ఉప్పల్ వైపు నుంచి పంజాగుట్ట/అమీర్‌పేట్‌ వెళ్లే ప్రయాణికులు తార్నాక, రైలు నిలయం రోడ్‌ను నివారించి ఆర్‌టీసీ ఎక్స్ రోడ్ నుంచి లక్డికాపూల్ మీదుగా వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ నుంచి ప్యాటినీ, పారడైస్, బేగంపేట్ దారులలో ఆంక్షలు ఉంటాయని పోలీసులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published.