టీఆర్ఎస్కు కాంగ్రెస్ షాక్
ఆర్.బి.ఎం హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ నేతలు పట్టుదలతో ఉన్నారు. టీఆర్ఎస్ అసంతృప్తి నేతలను కాంగ్రెస్లో చేర్చుకుంటున్నారు. వలసను కాంగ్రెస్ నేతలు ప్రొత్సహిస్తున్నారు. పూర్వ వైభవం కోసం హస్తం పార్టీ నేతలు ఆరాటపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో టీఆర్ఎస్కు కాంగ్రెస్ షాకిచ్చింది. టీఆర్ఎస్కు చెందిన బడంగ్పేట కార్పొరేషన్ మేయర్ పారిజాత నర్సింహారెడ్డి, కార్పొరేటర్లు పెద్దబావి సుదర్శన్రెడ్డితో పాటు మరికొందరు కార్పొరేటర్లు కాంగ్రెస్లో చేరనున్నారు. ఇందుకోసం ఈ నేతలు హస్తినకు పయనమయ్యారు. మేయర్, కార్పొరేటర్ల చేరికను కాంగ్రెస్ వర్గాలు గోప్యంగా ఉంచాయి. అయినా వలసకు సంబంధించి శనివారం రాత్రి విషయం బయటపడింది. దీంతో మేయర్ నర్సింహారెడ్డి, ఇద్దరు కార్పొరేటర్లను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి ప్రకటించారు.