కేసీఆర్ సొంత గడ్డపై రేవంత్ ‘దండోరా’
ఆర్.బి.ఎం గజ్వేల్: సీఎం కేసీఆర్ ఇలాక గజ్వేల్లో దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభ టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. కేసీఆర్ నియోజకవర్గం కావడంతో కాంగ్రెస్ సీరియస్గా తీసుకుంది. లక్షమందితో ఈ సభను నిర్వహించాలని ఆ పార్టీ అనుకుంటోంది. ఇంతకుముందు ఆగస్టు 9న క్విట్ ఇండియా ఉద్యమ దినం సందర్భంగా ఇంద్రవెల్లిలో తొలి దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభను నిర్వహించారు. అనంతరం రావిర్యాల, మూడుచింతలపల్లిలో సభలు సక్సెస్ చేశారు. చివరి సభను గజ్వేల్ పట్టణంలో నిర్వహించనున్నారు. ఈ సభకు కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జునఖర్గే ప్రత్యేక అతిథిగా హాజరవుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాతోపాటు పొరుగున ఉన్న జనగాం, మేడ్చల్-మల్కాజ్గిరి, నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల నుంచి ప్రజలను సభకు తరలించడానికి పకడ్బందీగా ప్రణాళికలు సిద్ధం చేశారు. రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని గద్దె దించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుపుతోంది.