యువకుడిని ఢీకొట్టిన బస్సు..
ఆర్.బి.ఎం వికారాబాద్: ఓ యువకుడిని బస్సు ఢీకొన్న ఘటన వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని రాఘవపూర్ గేట్ సమీపంలో ఎదురుగ మితిమీరిన వేగంతో వస్తున్న బస్సు బైక్ పైన వస్తున్న సైద్ పల్లి గ్రామానికి చెందిన షాబాద్ నరేష్ అనే యువకుడిని ఢీకొట్టింది. దింతో యువకుడికి తీవ్రమైన గాయాలు కావడంతో స్థానికులు చికిత్స నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.