యాదాద్రి ఆలయానికి భారీగా విరాళాలిచ్చిన నేతలు వీరే..
ఆర్.బి.ఎం యాదాద్రి: లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయ విమాన గోపురానికి సీఎం కేసీఆర్తోపాటు పలువురు మొత్తం రూ.2,03,67,721 విరాళాలు అందజేశారు. ముఖ్యమంత్రి తన కుటుంబం తరపున కిలో 16తులాల బంగారానికి రూ.52,48,097లను అందజేశారు. అదేవిధంగా హైదరాబాద్కు చెందిన ఎ.రజిత రూ.30,15000, స్నేహిత బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున 51,00,624, ఏనుగు దయానంద్రెడ్డి రూ.50,04,000, పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే ఎ.జీవన్రెడ్డి రూ.20లక్షల విరాళాలు అందజేశారు. ఎమ్మెల్యేతోపాటు ఆయన తల్లిదండ్రులు, ఎమ్మెల్యే సతీమణి రజితారెడ్డి, కుమార్తెలు అనౌశికరెడ్డి, అనన్యరెడ్డి, సోదరుడు రాజేశ్వర్రెడ్డి రేవతి దంపతులు, సోదరి కరుణ శ్రీనివా్సరెడ్డి దంపతులు, వెంకట్రాజన్న, రాజుభాయ్, తదితరులు పాల్గొన్నారు.