యాదవ్ సంఘం భవన్ ప్రారంభోత్సవంలో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: రాజేంద్రానగర్ నియోజకవర్గంలోని మైలార్దేవపల్లి డివిజన్లోని TNGOS కాలనీలో నూతన యాదవ సంఘం భవన్ ను రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ 30 లక్షలతో యాదవ సంఘం భవన్ నిర్మాణం పూర్తి చేశామని ప్రకాష్ గౌడ్ అన్నారు. యాదవ సోదరులు అందరు ఐక్యమత్యంగా ఉండాలని ప్రకాష్ గౌడ్ సూచించారు. ఇతర రాష్ట్రాల్లో అమలు కానీ సంక్షేమ పథకాలు మన తెలంగాణ రాష్ట్రంలో అమలౌతున్నాయని, రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ అన్ని కులాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని ప్రకాష్ గౌడ్ అన్నారు. ప్రతి పక్షాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్ని కుట్రలు చేసిన ప్రజలు నమ్మే స్థితిలో లేరని ప్రకాష్ గౌడ్ స్పష్టం చేశారు.కెసిఆర్ గారి పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ యాదవ సంఘం భవన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు మైకోల్ మహేందర్ యాదవ్,సంఘ అధ్యక్షుడు కృష్ణ యాదవ్,డివిజన్ ప్రెసిడెంట్ ప్రేమ్ గౌడ్,యూత్ ప్రెసిడెంట్ రఘు యాదవ్,శంషాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ గోపాల్ యాదవ్,యాదగిరి, సంఘ సభ్యులు పాల్గొన్నారు.