గులాబీ తీర్థం పుచ్చుకున్న మాజీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు రమణ..

గులాబీ తీర్థం పుచ్చుకున్న మాజీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు రమణ..

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: మాజీ తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ రోజు ప్రగతి భవన్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ రమణకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రమణతో పాటు తెరాస లో కి పలువురు తెలంగాణ రాష్ట్ర టీడీపీ ముఖ్య నాయకులు అధికార ప్రతినిధులు చేరారు. రమణను పార్టీలోకి ఆహ్వానిస్తూ ముఖ్యమంత్రి కెసిఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రమణ ఎక్కడున్నా తాను నమ్ముకున్న సిద్ధాంతాల కోసం పని చేసే వ్యక్తి అని కెసిఆర్ అన్నారు. రమణ తనకు మంచి మిత్రుడని కెసిఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రమణకు రాజకీయ భవిషత్తు చాల బాగుంటుందని కెసిఆర్ తెలిపారు . చేనేతలు ఎదురుకుంటున్న కొన్ని సమస్యల నుండి వారికీ విముక్తి కల్పించేందకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కెసిఆర్ వెల్లడించారు. చేనేత వర్గాలకు రాజకీయ ప్రాధాన్యత కలిపిస్తాం అని కెసిఆర్ అన్నారు. ప్రతి ఒక్క చేనేత కార్మికులకు భీమా అందిస్తాం అని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published.