ఫిబ్రవరి 1 నుంచి తెలంగాణలో స్కూళ్లు పునఃప్రారంభం
ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: ఫిబ్రవరి 1 నుంచి తెలంగాణలో స్కూళ్లు పునఃప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి స్కూళ్లు పునఃప్రారంభిస్తామని విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి అధికారికంగా ప్రకటించారు. పాఠశాలల్లో కరోనా నిబంధనలు కఠినంగా పాటించాలని ఆదేశించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సబిత ఇంద్రారెడ్డి సూచించారు. కోవిడ్ థర్డ్ వేవ్లో భాగంగా రాష్ట్రంలో విద్యాసంస్థలకు ప్రభుత్వం సంక్రాంతి సెలవులను ముందుగానే ప్రకటించింది. జనవరి 8 నుంచి 16 వరకు సెలవులు ప్రకటించారు. సెలవులు ముగిసిన వెంటనే ఈనెల 30 వరకు పొడిగించారు.