గవర్నర్‌ను అవమానించే ఉద్దేశం లేదు: హరీష్ రావు

గవర్నర్‌ను అవమానించే ఉద్దేశం లేదు: హరీష్ రావు

ఆర్.బి.ఎం హైదరాబాద్: గవర్నర్‌ను అవమానించే ఉద్దేశం తమకు లేదని మంత్రి హరీష్‌రావు తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ నాయకులను సూటిగా ప్రశ్నించారు. రాజ్‌భవన్‌కు కాషాయ రంగు ఎందుకు పూస్తున్నారు? రాజ్‌భవన్‌తో బీజేపీకి ఏం సంబంధం? అని ప్రశ్నించారు. గవర్నర్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని ప్రభుత్వాలను ఇబ్బంది పెడుతున్నారని బీజేపీ నేతలపై మండిపడ్డారు. మహిళా గవర్నర్‌ను అవమానిస్తున్నారని బీజేపీ నేతలు మాట్లాడడం దెయ్యాలు వేదాలు వళ్లించినట్లుగా ఉందని హరీష్‌రావు ధ్వజమెత్తారు.

ఈ నెల 7వ తేదీనుంచి నుంచి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన సోమవారం ప్రగతి భవన్‌లో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో బడ్జెట్‌ సమావేశాల తేదీని నిర్ణయించారు. 7 నుంచి శాసనసభ, శాసన మండలి సమావేశాలు ప్రారంభమవుతాయంటూ శాసన సభా కార్యదర్శి నర్సింహాచార్యులు ఉత్తర్వులు జారీ చేశారు.

Leave a Reply

Your email address will not be published.