ఒకవైపు కరోనా భయం..మరో వైపు మద్యం..
ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వ్యాప్తి అధికం అవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పది రోజులపాటు రాష్ట్రంలో లాక్ డౌన్ విధిస్తు ఉతర్వులు జారీచేసింది. ఇది ఇలా ఉంటె లాక్ డౌన్ అంశం తెరపైనికి వచ్చిన కొద్దీ క్షణాల్లోనే మందు బాబులు వైన్ షాప్స్ వద్ద బారులు తీరారు. నగరంలో ఉన్న ప్రతి వైన్ షాప్ వద్ద ప్రజలు మద్యం కోసం ఎగబడ్డారు. ఈ క్రమంలో మందు బాబులు నిబంధనలకు విరుదంగా మాస్కులు లేకుండా భౌతిక దూరం పాటించకుండా గుంపులు గుంపులుగా గుమ్మిగూడి మద్యం కొనుగోళ్ళకు ఎగబడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఉదయం 6 నుండి 10 గంటలవరకు సడలింపు ఇస్తున్నటు తెలుస్తోంది కాగా వాటిలో వైన్ షాప్స్ ఉంటాయో ఉండవో మరికాసేపట్లో తెలియనుంది.