దళిత బంధు పథకం ప్రతి కుటుంబానికి అందాలి.. లేకపోతే దీక్ష చేస్తాం: ఈటల రాజేందర్

దళిత బంధు పథకం ప్రతి కుటుంబానికి అందాలి.. లేకపోతే దీక్ష చేస్తాం: ఈటల రాజేందర్

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హుజురాబాద్  ఉప ఎన్నికల నేపథ్యంలో దళితుల కోసం దళిత బంధు పథకం ప్రవేశ పెట్టడం మంచిదేనని కానీ ఆ దళిత బంధు పథకం హుజురాబాద్ నియోజకవర్గంలో నివసిస్తున్న ప్రతి దళిత కుటుంబానికి అందాలని రాష్ట్ర మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ ప్రభుత్వాని డిమాండ్ చేశారు. దళిత బంధు పథకం ద్వారా వచ్చే పది లక్షల రూపాయలను దళితులు వాళ్ల నైపుణ్యానికి అనుగుణంగా వాడుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించాలని ఈటల రాజేందర్ సూచించారు. ఆ దళిత బంధు పథకంపై అధికారుల అజమాయిషీ తీసివేయాలని ఈటల రాజేందర్ ప్రభుత్వాని డిమాండ్ చేశారు. దళిత బంధు పథకం ప్రతి ఒక్కరి అందాలి ఒకవేళ ప్రభుత్వం అందించకపోతే ఉద్యమం చేయక తప్పదని ఈటల రాజేందర్ ఈ సందర్బంగా ప్రభుత్వాని హెచ్చరించారు. దళిత బంధు పథకం హార్హులందరికి అందించకుండా చేతులు దులుపుకునె ప్రయత్నం చేస్తే స్వయంగా తానే దీక్షకు కూర్చుంటానని బీజేపీ నేత ఈటల రాజేందర్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published.