కరోనా వారియర్లకు పురస్కారాలు

కరోనా వారియర్లకు పురస్కారాలు

ఆర్.బి.ఎం సికింద్రాబాద్: సికింద్రాబాద్ జిహెచ్ఎంసి పరిధిలో కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలో పలువురు అంకిత భావంతో విధులు నిర్వర్తించడం ద్వారా ప్రజలను ఆదుకున్నారని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. జిహెచ్ఎంసి సికింద్రాబాద్ పరిధిలో కరోనా వారియర్లకు సర్టిఫికెట్లను అందించే కార్యక్రమం సితాఫలమండీ లో శనివారం జరిగింది. ఈ సందర్భంగా తీగుల్ల పద్మారావు గౌడ్ మాట్లాడుతూ కరోనా సమయంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ప్రజల సేవల్లో పాల్గొన్న వారిని ప్రోత్సహించాల్సి అని పద్మారావు గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్, కార్పొరేటర్లు కుమారి సామల హేమ, శ్రీమతి లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్, శ్రీమతి రాసురి సునిత, శ్రీమతి కంది శైలజ, జోనల్ కమీషనర్ శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ కమీషనర్ మోహన్ రెడ్డి, తెరాస నేతలు మోతీ శోభన్ రెడ్డి , రామేశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.