CMRF ద్వారా పేదలకు ఖరీదైన వైద్యం : ఉప సభాపతి పద్మారావు గౌడ్
ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: దేశంలోనే ఉన్నతమైన సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందించడంలో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారిదే అని అటువంటి గొప్ప వ్యక్తి నిరుపేద ప్రజలకు ఖరీదైన వైద్యం అందని ద్రాక్షగా ఉందని అటువంటి వారికి ఒక వరంలా ముఖ్యమంత్రి సహాయనిధి పథకాన్ని అర్జీ పెట్టిన అర్హులైన వారందరికీ CMRF అందిస్తున్నారన్నారు. నిరుపేదలకు మంచి వైద్యాన్ని అందించేందుకు తన వంతు కృషి లో భాగంగా ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ సోమవారం సికింద్రాబాద్ నియోజకవర్గానికి చెందిన CMRF ద్వారా మంజురైన నిధుల మంజూరు పత్రాలు (LOC) లబ్దిదారులకు అందించారు.టకారబస్తీ నివాసం లోని క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలు అనారోగ్య సమస్యలతో బాదపడుతున్న వారికి చ రూ.4 లక్షల విలువజేసే LOC పత్రాలను నార్త్ లాలగూడ ప్రాంతానికి చెందిన హమీద్ కు అక్షరాల 2 లక్షలు అడ్డగుట్ట ACS నగర్ ప్రాంతానికి చెందిన కనకయ్య రూ.1.00 లక్షల, సీతాఫలమండీ డివిజన్ కి చెందిన అబ్దుల్ అజిజ్ కు 1.00 లక్ష గౌరవ ఉప సభాపతి పద్మారావు గౌడ్ గారు అందచేశారు.ఈ కార్యక్రమంలో తెరాస యువనాయకులు తీగుళ్ల కిషోర్ కుమార్ గౌడ్, తీగుళ్ల రామేశ్వర్ గౌడ్ పలువురు నాయలుకలు కార్యకర్తలు పాల్గొన్నారు