రాజకీయాల్లో ఇంకో 20 సంవత్సరాలు ఉంట: రేవంత్ రెడ్డి
ఆర్.బి.ఎం డెస్క్: రాజకీయాల్లో మరో 20 సంవత్సరాలు కొనసాగుతానని కాంగ్రెస్ కార్యకర్తల కోసం ఆఖరి ఊపిరి వరకు చివరి రక్తం బొట్టు వరకు పని చేస్తానని దళిత గిరిజన ఆత్మగౌరవ సభలో ఎంపీ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. కార్యకర్తలకు ఎల్లపుడు అందుబాటులో ఉంటానని రేవంత్ రెడ్డి కార్యకర్తలకు భరోసానిచ్చారు. తాను గిరిజన కుటుంబంలో జన్మించకపోయినప్పటికీ నల్లమల్ల అడవిలో పెరిగిన బిడ్డనని శెంచుల కష్టాలు ఏంటో తనకు తెలుసని అడవిలో ఉండే కష్టాలు అన్ని తెలిసిన వాడినని రేవంత్ రెడ్డి తెలిపారు.