ఆడపిల్లల తల్లిదండ్రులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం: ఉప సభాపతి పద్మారావు గౌడ్

ఆడపిల్లల తల్లిదండ్రులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం: ఉప సభాపతి పద్మారావు గౌడ్

ఆర్.బి.ఎం డెస్క్: ఉప సభాపతి పద్మారావు గౌడ్  ముషీరాబాద్, మారేడుపల్లి రెవిన్యూ మండలాల పరిధిలో సితాఫలమండీ, బౌద్దనగర్, అడ్డగుట్ట, మెట్టుగూడ, తార్నాక డివిజన్లకు సంబంధించిన రూ. 115 లక్షలకు పైగా విలువ చేసే 30కళ్యాణ లక్ష్మి,59 షాదిముబారాక్ చెక్కులను, రూ. 26లక్షలకు పైగా విలువ చేసే CMRF చెక్కులను సితాఫలమండీ లోని క్యాంపు కార్యాలయంలో సోమవారం నాడు అందచేశారు.

ఈ సందర్భంగా ఉప సభాపతి పద్మారావు గౌడ్ మాట్లాడుతూ ఆడపిల్లల పెళ్ళిళ్ళు తల్లి దండ్రులకు భారంగా మారకుండా ఏర్పాట్లు జరిపి, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పధకాలను ప్రవేశ పెట్టిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారికే దక్కిందని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. నిరుపేద ప్రజల సంక్షేమానికి వివిధ సంక్షేమ పధకాలను అమలు జరుపుతోందని ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు.

పేద ప్రజలకు వైద్య సేవలను అందించేందుకు cmrf ను సద్వినియోగం చేసుకుంటున్నామని పద్మారావు గౌడ్ పేర్కొన్నారు. అర్హులకు రేషన్ కార్డులను అందిస్తామని పద్మారావు గౌడ్ తెలిపారు.

షాది ముబరాక్, కళ్యాణ లక్ష్మి, పెన్షన్ పధకాల లబ్దిదారులు ఎవ్వరికీ చిల్లి గవ్వ కూడా చెల్లించాల్సిన అవసరం లేదని, ఎవరైనా డబ్బులు అడిగితే తమ కార్యాలయం నెంబరు 040-27504448 కు ఫిర్యాదు చేయవచ్చునని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా సూచించారు. తాసిల్దార్లు శ్రీమతి జానకి, సునీల్ కుమార్, కుమారి సామల హేమ, శ్రీమతి రాసురి సునిత, శ్రీమతి కంది శైలజ, శ్రీమతి లింగాని ప్రసన్న లక్ష్మి, తెరాస యువ నేతలు తీగుళ్ళ కిషోర్ కుమార్ గౌడ్ , తీగుళ్ళ కిరణ్ గౌడ్ తీగుళ్ళ రామేశ్వర్ గౌడ్, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.