బండి సంజయ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన జగ్గారెడ్డి

బండి సంజయ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన జగ్గారెడ్డి

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియా సమావేశంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ హిందువుల కోసం లేవనెత్తిన నాలుగు అంశాలపై చర్చించేందుకు సిద్ధమా అంటూ జగ్గారెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎనభై శాతం మంది హిందువుల కోసం పనిచేస్తానని బండి సంజయ్ చెప్పారని జగ్గారెడ్డి అన్నారు. ప్రధాన మంత్రి మోదీతో మాట్లాడి పెట్రోల్,డీజిల్ ధరలు హిందువుల కోసం తగ్గించమని చెప్పగలవా అంటూ జగ్గారెడ్డి ప్రశ్నించారు. తెలంగాణలో ఉన్న హిందువుల కోసం ప్రధాన మంత్రితో మాట్లాడి 15 లక్షల రూపాయలు ప్రతి పేదవాడికి ఇప్పించగలవా? రాష్ట్రంలో ఉన్న హిందువుల కోసం ఇచ్చిన మాట మీద నిలబడగలవా అంటూ జగ్గారెడ్డి బండి సంజయ్ పై ప్రశ్నల వర్షం కురిపించాడు. బీజేపీ పార్టీకి రక్తం తాగే పులిలాంటి స్వభావం ఉందని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు . బీజేపీ పార్టీ ప్రజల పక్షాన పోరాడకుండా హిందుత్వం పేరుతో హిందువులను రెచ్చగొడుతున్నారని జగ్గారెడ్డి మండిపడ్డారు.

Leave a Reply

Your email address will not be published.