రాష్ట్ర వ్యాప్తంగా బిసి బంధు పథకం అమలు చేయకపోతే పోరాటాలు చేస్తాం:వి హనుమంత రావు
ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో దళిత బంధు పథకం అమలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం అదే తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా బిసి బంధు పథకం అమలు చేయాలని మాజీ పిసిసి అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వీ హనుమంతరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు ఆర్ధికంగా పరిపుష్టి చెందాలంటే దళిత బంధు పథకం తరహాలో బీసీ బంధు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశపెట్టాలని వి.హనుమంతరావు ప్రభుత్వాన్ని కోరారు.
బడుగు బలహీన వర్గాల ఓట్లే అత్యధికంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయని బీసీలను విస్మరిస్తే టిఆర్ఎస్ ప్రభుత్వానికి హుజరాబాద్ లో రాబోయే ఉప ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని వి హనుమంత రావు చెప్పుకొచ్చారు.తెలంగాణ రాష్ట్రంలో బీసీ బంధు పథకం అమలు చేయలేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తామంటూ హనుమంతు రావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు