కేసీఆర్‌, కేటీఆర్‌లను కలుస్తా: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

కేసీఆర్‌, కేటీఆర్‌లను కలుస్తా: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

ఆర్.బి.ఎం నల్లగొండ: ప్రజల సమస్యలపై త్వరలోనే సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లను కలుస్తానని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రకటించారు. నీలగిరి అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ (నుడా) ప్లాన్‌లో ప్రజలకు ఇబ్బందులు కలిగే ప్రతిపాదనలు ఉన్నాయని తప్పుబట్టారు. నల్లగొండకు చెందిన కొందరు టీఆర్‌ఎస్‌ నాయకులు చిల్లర రాజకీయాలకు చేస్తున్నారని మండిపడ్డారు. దుకాణ యజమానులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. శివాలయం ఉన్న ప్రదేశంలో ఫిష్‌ మార్కెట్‌, నాన్‌వెజ్‌ మార్కెట్‌ నిర్మించడమేమిటని ప్రశ్నించారు. నల్లగొండలో ఒక్క పేదవాడికి కూడా సొంత ఇల్లు లేదన్నారు. సిద్ధిపేట, సిరిసిల్ల మాదిరిగా నిరుపేదలందరికీ డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు కట్టివ్వాలని వెంకట్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published.