కేసీఆర్‌ మేడారం పర్యటన రద్దు..

కేసీఆర్‌ మేడారం పర్యటన రద్దు..

ఆర్.బి.ఎం భూపాలపల్లి: సీఎం కేసీఆర్‌ మేడారం పర్యటన రద్దయింది. సీఎం మేడారం వస్తారని అధికారులు ఏర్పాట్లు కూడా చేశారు. సీఎం పర్యటన నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు మేడారం వచ్చారు. కేసీఆర్ రాకపోవడంతో సాయంత్రం 4గంటల వరకు ఎదురుచూసి అందరూ తిరుగుముఖం పట్టారు. ఉన్నఫలంగా సీఎం పర్యటన రద్దు కావడంతో టీఆర్‌ఎస్‌ శ్రేణులు నిరాశ చెందారు. అయితే కేసీఆర్ పర్యటనపై పలు కారణాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా కేసీఆర్, ఇతర రాష్ట్రాల సీఎంలను కలువాలనున్నారు. ఇందులోభాగంగా 20వ తేదీన మహారాష్ట్ర సీఎం ఉద్దవ్‌ఠాక్రేతో కేసీఆర్‌ భేటీ ఉంది. ఆ తర్వాత తమిళనాడు సీఎం స్టాలిన్‌ను కూడా కేసీఆర్ కలుస్తారనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ మేడారం రాలేకపోయారని ప్రచారం జరుగుతోంది.

Leave a Reply

Your email address will not be published.