కెసిఆర్ తెలంగాణ ప్రజల్ని కన్నా బిడ్డలా చూస్తున్నాడు: మోహన్ బాబు

కెసిఆర్ తెలంగాణ ప్రజల్ని కన్నా బిడ్డలా చూస్తున్నాడు: మోహన్ బాబు

ఆర్.బి.ఎం డెస్క్  హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కరోనా బారినపడిన విషయం తెలిసిందే. కెసిఆర్ కరోనా బారి నుండి తొందరగా కోలుకోవాలని ఆ కరోనా మహమ్మారి కెసిఆర్ ని ఏమి చేయలేదని ప్రముఖ నటుడు మోహన్ బాబు వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలను కెసిఆర్ తమ కన్నబిడ్డల్లా చూసుకుంటున్నారని అయన నిండు నూరెళ్లు ఆరోగ్యంగా ఉండాలని ఆ షిరిడీ సాయినాథున్ని ప్రార్థిస్తున్నానని మోహన్ బాబు ట్విట్టర్ వేదికగా తెలిపారు. ప్రస్తుతం కెసిఆర్ కి తన ఫామ్‌ హౌస్‌లో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నట్టు సిఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. కెసిఆర్ కు కరోనా లక్షణాలు స్వల్పంగా ఉండటంతో వేగంగా ఆరోగ్యం కుదుటపడుతోందని అయన తెలిపారు. కెసిఆర్ ఆరోగ్యం పట్ల ఎవరు ఆవేదన చెందొద్దని అయన అన్నారు.

Leave a Reply

Your email address will not be published.