మిత్రులకు శ్రేయోభిలాషులకు మరియు చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్ష‌లు: బి.జనార్దన్ రెడ్డి,బీజేపీ చేవెళ్ల పార్లమెంట్ ఇంచార్జి

ప్ర‌జ‌ల‌కు శ్రీరామ నవమి శుభాకాంక్ష‌లు: బి.జనార్దన్ రెడ్డి,బీజేపీ చేవెళ్ల పార్లమెంట్ ఇంచార్జి

సామాజిక‌, భౌతిక దూర‌మే శ్రీ‌రామ ర‌క్ష‌!
ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్ర‌జ‌ల‌కు శ్రీ‌రామ న‌వ‌మి శుభాకాంక్ష‌లు…

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: మిత్రులకు,శ్రేయోభిలాషులకు హిందూ బందువులకు   చేవెళ్ల పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు బీజేపీ చేవెళ్ల పార్లమెంట్ ఇంచార్జి బి.జనార్దన్ రెడ్డి శ్రీరామ న‌వ‌మి శుభాకాంక్షలు తెలిపారు. కరోనా వైరస్ ప్రభావం ఎక్కువ‌గా ఉన్నందున ప్రజలంతా గత సంవత్సరం శ్రీరామ నవమి వేడుకలు ఎలాగైతే జరుపుకున్నారో ఈ సారికూడా అదేవిధంగా ఎవరి ఇళ్లల్లో వారు పండుగను జరుపుకోవాలని జనార్దన్ రెడ్డి కోరారు. ఆ సీతా రామ చంద్రుల కరుణా కటాక్షాలు, ఆశీస్సులు రాష్ట్ర, దేశ ప్ర‌జ‌ల‌పై ఉండాల‌ని, ప్ర‌జ‌లంద‌రూ సుఖ సంతోషాల‌తో ఉండేలా చూడాల‌ని, యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మ‌హమ్మారి నుంచి త్వ‌ర‌గా దేశ ప్రజలను ప్ర‌ధానంగా మ‌న రాష్ట్రానికి విముక్తి క‌ల‌గాల‌ని ఆ శ్రీరామ్ చంద్రుడిని మనసారా కోరుకుంటున్నాని జనార్దన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో దేశంలో రోజు రోజుకు క‌రోనా కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి ఈ నేపథ్యంలో ప్ర‌జ‌లంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండి ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ అవసరం ఉంటె తప్ప బయటికి వెళ్ళవద్దు ఒకవేళ వెళ్లిన తప్పనిసరిగా మాస్క్ ధరించి భౌతిక దూరం పాటించాలని అయన సూచించారు. కరోనా కోరల నుంచి విముక్తి కల్పించే కొవిడ్‌ వ్యాక్సిన్ ప్ర‌తి ఒక్క‌రూ వేసుకోవాలని విజ్ఞ‌ప్తి చేశారు.వ్యాక్సిన్ తీసుకున్న వారితోపాటు తీసుకోని వారంతా కూడా  భౌతిక దూరం పాటిస్తూ తమ ఆరోగ్యాలను కాపాడుకుంటూ ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని  బీజేపీ చేవెళ్ల పార్లమెంట్ ఇంచార్జి బి.జనార్దన్ రెడ్డి కోరారు.

Leave a Reply

Your email address will not be published.