సీఎం ప్రధాని కావాలి: మల్లారెడ్డి
ఆర్.బి.ఎం భూపాలపల్లి: సీఎం కేసీఆర్ ప్రధాని కావాలని కోరుతూ సమ్మక్క, సారలమ్మ తల్లులకు మంత్రి మల్లారెడ్డి మొక్కులు చెల్లించుకున్నారు. కేసీఆర్కు ప్రధానమంత్రి అయ్యేందుకు అన్ని అర్హతలున్నాయని, రానున్న రోజుల్లో కేసీఆర్ ప్రధానమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని అభివృద్ధి తెలంగాణలో చేశారని తెలిపారు. మేడారం జాతర అభివృద్ధిపై కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించడం వల్లనే భారీ సంఖ్యలో భక్తులు ప్రశాంతంగా దర్శనం చేసుకుంటున్నారని మంత్రి పేర్కొన్నారు.