యాదాద్రి ఆలయ గోపురానికి కిలో బంగారమిచ్చిన కేసీఆర్..

యాదాద్రి ఆలయ గోపురానికి కిలో బంగారమిచ్చిన కేసీఆర్..

యాదాద్రి: యాదాద్రి ఆలయ గోపురానికి బంగారు తాపడం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు తమ కుటుంబం తరఫున ప్రకటించిన 1 కిలో 16 తులాల బంగారానికి సంబంధించిన రూ.52.48 లక్షల చెక్కును ముఖ్యమంత్రి దంపతులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వారి మనవడు కల్వకుంట్ల హిమాన్షురావు చేతుల మీదుగా దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి, ఆలయ అధికారులకు అందజేశారు. అలాగే, యాదాద్రి ఆలయ గోపురానికి బంగారు తాపడం కోసం ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి 1 కిలో బంగారం కోసం రూ.50 లక్షల 15 వేల చెక్కును, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వేంరెడ్డి నర్సింహరెడ్డి 1 కిలో బంగారం కోసం రూ. 51 లక్షల చెక్కును, ఏనుగు దయానంద రెడ్డి 1 కిలో బంగారం కోసం 50 లక్షల 4 వేల చెక్కును అధికారులకు అందజేశారు. పూజా కార్యక్రమాల అనంతరం సీఎం కేసీఆర్ యాదాద్రి ఆలయ ప్రాంగణంలో కలియదిరుగుతూ నిర్మాణాలపై పలు సూచనలు చేశారు.

Leave a Reply

Your email address will not be published.