ప్రశ్నించే తత్వం అలవర్చుకోవాలి.. జస్టిస్ ఎన్వీరమణ
ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: సమాజంలో జరుగుతున్న అన్యాయాలకు విద్యార్థులు వ్యతిరేకంగా గళం విప్పాలని ప్రశ్నించే తత్వం అలవర్చుకోవాలని సుప్రీం కోర్ట్ ప్రధాన న్యామూర్తి జస్టిస్ ఎన్వీ రమణ లా విద్యార్థులకు సూచించారు. దామోదరం సంజీవయ్య లా యూనవర్సిటీ కాన్వాకేషన్ కార్యక్రమంలో అయన పాల్గొన్నారు. కాన్వాకేషన్ కార్యక్రమంలో జస్టిస్ రమణ మాట్లాడుతూ విద్యార్థులు మౌనాన్ని వీడాలని మౌనం పిరికితనంతో సమానం అని అయన పేర్కొన్నారు. దివంగత మాజీ సీఎం సంజీవయ్య పారదర్శక, అవినీతి రహిత పాలనకు నిదర్శనమని జస్టిస్ రమణ వ్యాఖ్యానించారు. నూతన పంథాలో నిర్మాణాత్మకంగా ఆలోచించాలని విద్యార్ధులకు అయన తెలిపారు. జాతి నిర్మాణంలో ఉపాధ్యాయులది విద్యాసంస్థలది కీలక పాత్ర అని అన్నారు. చదువే చివరి లక్ష్యం ప్రజాప్రయోజనం అవ్వాలని దామోదరం సంజీవయ్య లా యూనవర్సిటీ కాన్వాకేషన్ కార్యక్రమంలో జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు.