రైతులకు త్వరితగతిన విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లును అందించాలి: శ్రీకాంత్ రెడ్డి

రైతులకు త్వరితగతిన విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లును అందించాలి: శ్రీకాంత్ రెడ్డి

  • నియోజక వర్గంలోని విద్యుత్ సమస్యలుపై ఏ పి ఎస్ పి డి సి ఎల్ ఈ ఈ తో చర్చించిన చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి

ఆర్.బి.ఎం: రైతులకు త్వరితగతిన విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లును అందించాలని ఏ పి ఎస్ పి డి సి ఎల్ ఈఈ చంద్రశేఖర్ రెడ్డికి ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి సూచించారు. ఆదివారం శ్రీకాంత్ రెడ్డి తన కార్యాలయంలో జెడ్ పి మాజీ వైస్ చైర్మన్ దేవనాథరెడ్డితో కలసి నియోజక వర్గ పరిధిలోని విద్యుత్ సమస్యలపై చర్చించారు. నియోజకవర్గ పరిధిలో 177 ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోయాయని, తక్షణమే వాటికి మరమ్మత్తులు చేపట్టి రైతులుకు అందచేయాలని సూచించారు. రెండు వారాలలోగా నూతన 200 విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లును అందించాలన్నారు.నిర్మాణ దశలో ఉన్న సబ్ స్టేషన్ నిర్మాణ పనులపై ఆయన ఆరా తీశారు. నియోజక వర్గ పరిధిలోని విద్యుత్ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని ట్రాన్స్ కో సీఎండీ కి ఫోన్ లో సూచించారు.

Leave a Reply

Your email address will not be published.