బ్రిటిష్ వారిని గడగడలాడించిన విప్లవ యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్: పద్మారావు గౌడ్,ఉప సభాపతి
ఆర్.బి.ఎం: భారతదేశానికి స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలు రావాలంటే సాయుధ పోరాటమే మార్గమని “ఆజాద్ హింద్ ఫౌజ్” స్థాపించి బ్రిటిష్ వారిని గడగడలాడించిన విప్లవ యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని ఉప సభాపతి పద్మారావు గౌడ్ అన్నారు. ఆదివారం సుభాష్ చంద్ర బోస్ జయంతిని పురస్కరించుకుని పద్మారావు గౌడ్ నేతాజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. యువతకు నేతాజీ సుభాష్ చంద్ర బోస్ స్ఫూర్తి ప్రదాత అని ఆయన అన్నారు. ప్రతి భారతీయుడి హృదయంలో స్వరాజ్య ఉద్యమం పట్ల సరికొత్త ఉత్సాహాన్ని నింపిన మహోన్నత జాతీయవాది, స్వరాజ్య సంగ్రామ యోధుడు, క్రాంతదర్శియైన రాజకీయనాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని ఈ సందర్భంగా ఉప సభాపతి పద్మారావు గౌడ్ తెలిపారు.