నా కూతురు జీవితంతో మన్నుపోశాడు : సింగరేణి కాలనీ నిందితుడి అత్త
ఆర్.బి.ఎం సూర్యాపేట: తెలుగు రాష్ట్రాల్లో సంచటనం రేపిన సింగరేణి కాలనీ చిన్నారి హత్యాచారం చేసిన నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. రాజు ఆత్మహత్యపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. రాజుకు బతికే హక్కులేదని అత్త యాదమ్మ తేల్చిచెప్పారు. తన కుమార్తె మౌనిక జీవితాన్ని నాశనం చేశాడని ఆమె వాపోయింది. తన కూతురు జీవితంతో పాటు మరో చిన్నారి జీవితాన్ని నాశనం చేశాడని ఆమె చెప్పారు. రాఖీ పండుగకు ముందు రాజు జలాల్పురానికి వచ్చాడని తెలిపారు. తనపై చేయిచేసుకున్నాడని, తన గొంతు నొక్కబోతే తన కుమారుడు అడ్డుకున్నాడని యాదమ్మ తెలిపింది. ఆ తర్వాత తమ గ్రామానికి రాలేదని యాదమ్మ చెప్పింది.