నా భర్తను చంపారు.. నాకు నా కూతురికి న్యాయం కావాలి: నిందితుడు రాజు భార్య

నా భర్తను చంపారు.. నాకు నా కూతురికి న్యాయం కావాలి: నిందితుడు రాజు భార్య

ఆర్.బి.ఎం హైదరాబాద్: తన భర్త రాజును పోలీసులు చంపారని తనకు, తన కూతురికి ప్రభుత్వమే న్యాయం చేయాలనీ సింగరేణి కాలనీ చిన్నారి హత్యాచారం నిందితుడు రాజు భార్య అన్నారు. హైదరాబాద్ లో ఉన్న తమ ఇల్లును పూర్తిగా ధ్వంసం చేసారని తాము కట్టుబట్టలతో వచ్చామని ప్రభుత్వం ఏమైనా తమ కుటుంబానికి న్యాయం చేయాలనీ నిందితుడి భార్య పేర్కొన్నారు. మూడు రోజుల కిందటే రైల్వేస్టేషన్‌లో తన భర్త రాజును పోలీసులు పట్టుకున్నారని ఆమె తెలిపారు. తన భర్తను ఎన్‌కౌంటర్ చేయాలని పోలీసులు మాట్లాడుకుంటే విన్నానని రాజు భార్య అన్నారు. తమను మూడు రోజుల కిందటే పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. మూడు రోజుల నుంచి స్టేషన్‌లో ఉన్నా ఎవరూ రాలేదని, నిన్న ఒక్కసారి అందరూ వచ్చారని ఆమె తెలిపారు. పోలీసులు పెద్ద సంఖ్యలో రావడంతో తమకు అప్పుడే అనుమానం వచ్చిందని రాజు భార్య పేర్కొన్నారు. నిన్న రాత్రి తమను ఉప్పల్‌లో వదిలి పెట్టారని, తమను అటు పంపించి ఈ రోజు ఉదయం రాజును చంపేశారని వీరమ్మ ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published.